21.7 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కోర్టులో మెడికల్ క్యాంప్

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కోర్టులో మెడికల్ క్యాంప్

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కోర్టులో మెడికల్ క్యాంప్.

సిద్దిపేట: యదార్థవాది ప్రతినిది

లైన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట ఆధ్వర్యంలో ఆర్విఎం హాస్పిటల్ సహకారంతో సిద్దిపేట బార్ అసోసియేషన్ కోర్టు కాంప్లెక్స్ లో శుక్రవారం మెడికల్ క్యాంపు నిర్వహించారు.ఈ క్యాంపు ను జిల్లా జడ్జి ప్రిన్సిపల్ టి.రఘురాం జిల్లా అదనపు జడ్జి భవాని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ స్వాతి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి టి.రఘురాం మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యమని అందరూ ఆరోగ్యంగా ఉండడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. క్యాంపులో 467 మంది ఓపి చెక్ అప్ చేసుకున్నారని, అందరు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.కార్యక్రమంలో జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ జనార్దన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ అడ్వకేట్లు సాయిబాబా, శ్రీకాంత్, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, హరిహర రావు, రాములు, కమాలుద్దీన్, లైన్స్ క్లబ్ సిద్దిపేట్ అధ్యక్షుడు గంప రమేష్ జిఎస్టి కోఆర్డినేటర్ జోజి డైరెక్టర్ చింత భాస్కర్ కోఆర్డినేటర్ లగిశెట్టి నర్సింహులు ఆర్విఎం హాస్పిటల్ డాక్టర్స్ బృందం పాల్గొన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్