వసతి గృహాల పై విచారణ జరపాలి కొండ ప్రశాంత్
యదార్థవాది ప్రతినిధి మెదక్
మెదక్ జిల్లా బీసి సంక్షేమ వసతి గృహలను జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులపై విచారణ జరపాలని జిల్లా కేంద్రంలో ఆల్ ఇండియా ప్రోగ్రెస్ స్టూడెంట్ యూనియన్ ఆఫీసులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వసతి గృహాలను పరిశీలించినప్పుడు అనేకమైన సమస్యలు మా దృష్టికి వచ్చేయ్ అన్నారు వసతి గృహాలలో విద్యార్థులకు సరైన వసతులు కల్పించడం లేదు వారికి రావలసిన కాస్మోటిక్ చార్జీలు ఇతర సామాగ్రిని విద్యార్థుల బుక్స్ ను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారు వసతి గృహాల అధికారుల పై విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని లేనియెడల కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యవర్గ సభ్యులు సాయి కుమార్ నాయకులు శివ అలీమోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.