విద్య ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు..బోయినపల్లి వినోద్

273

విద్య ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు..బోయినపల్లి వినోద్

హైదరాబాదు 27 డిసంబర్

అన్ని వర్గాల ప్రజలకు మనోధైర్యాన్ని నింపిన కేసిఆర్

అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతె నూతన విద్యా విధానం అమలు చేయాలి..

హైదరాబాదు నారాయణగూడ తాజ్ మహల్ హోటల్ లో మంగళవారం పాల్గొన్న 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉపాధ్యాయ సంఘాలతో మండలి సమావేశంలో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ జాతీయ నూతన విద్యా విధానం లో అనేక లోటుపాట్లు ఉన్నాయని, దేశంలోని అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. సమాజంలో ఎవరికైనా ఆత్మవిశ్వాసమే వజ్రాయుధమని, అలాంటి ఆత్మ విశ్వాసాన్ని నింపిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. విద్య ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు అని, విద్యా హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఏ ద్వారా అమలులోకి వచ్చిందని, ఉపాధ్యాయులు నిరంతరంగా తమ సబ్జెక్టులలో పునఃశ్చరణ జరుపుకోవాలని, దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాదాయ సంఘాల జాతీయ మండలి సభ్యులకు తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఉద్యమ నేపథ్యాన్ని వివరించారు. తెలంగాణ స్వరాష్ట్రంలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ, జాతీయ స్థాయిలో అవార్డులు – రివార్డులు, సాధించమని వినోద్ కుమార్ అన్నారు. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు అశ్వని కుమార్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి