విద్యార్థి దశ నుంచే ఉత్తమ పౌరులుగా ఎదగాలి.
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని జిల్లా విద్యా శాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తిమ్మాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా వస్తువులు స్కూల్ బ్యాగులు ఆయన చెతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ సేవలో ప్రత్యేకించి విద్యార్ధుల సర్వతోముఖాభివృద్ధికి ఎర్త్ ఫౌండేషన్ యొక్క సామాజిక మానవతా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చాలా బాగా ఉన్నాయని ప్రశంసించారు. విద్యార్థులు చక్కటి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని చూచించారు. ఉత్తమ పౌరులుగా ఎదిగి భావి జీవితాన్ని బంగారమయం చేసుకోవాలని అభిలాషించారు అనంతరము అక్బర్ పేట భూంపల్లి మండలం లోని పిఎస్ నగరము పిఎస్ తాళ్లపల్లి పోతారెడ్డిపేట లోని రెండు ప్రాథమిక పాఠశాలలను పిఎస్ ఎనుగుర్తిని అనంతరం దుబ్బాక మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాలలు రగోతంపల్లి గోసాన్ పల్లి అచ్చమాయపల్లి కమ్మరపల్లి ప్రాథమిక పాఠశాలలు టేకుల తాండ శిలాజినగర్ హబ్సిపూర్ లను సందర్శించి ఉపాధ్యాయులు బోధన విధానాన్ని పరిశీలించారు. బోధనలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వినియోగించాలని సూచించారు. ఉపాధ్యాయులు సిలబస్ కనుగొనంగా ఎఫ్ ఎల్ ఎన్ డైరీలు ఉన్నతి డైరీలు రాసి మంచి బోధన చేయాలని ఆదేశించారు.