వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అద్వర్యంలో మహాదర్న
యదార్థవాది ప్రతినిది నిజామాబాద్
వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అద్వర్యంలో నిజమాబాద్ నగరంలోని రాజా రాజేంద్ర చౌరస్తా వద్ద మహా దర్న చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే ప్రధాన మంత్రి మోదీ వంటగ్యాస్ ధరలను పెంచారని, ప్రతిసారీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం. కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని, గృహావసరాల సిలిండర్ ధరను రూ.50, వాణిజ్య సిలిండర్ ధరను రూ. 350 మేర భారీగా పెంచారని, మోదీ ప్రభుత్వం రాకముందు రూ.400 ఉన్న సిలిండర్ ధర గురువారం నాడు రూ. 1160 దాటి రూ.1200 వరకు పెరిగిందన్నారు, ఒకవైపు ఉజ్వల స్కీమ్ పేరుతో మాయమాటలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం భారీగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ, వారిని సిలిండర్లకు దూరం చేస్తోందని విమర్శించారు. గతంలో రాయితీ ద్వారా సిలిండర్లు పొందిన మహిళలు ఇప్పుడు వాటిని కొనలేక కట్టెల పొయ్యిపై వంట చేయాల్సిన పరిస్థితులు తలెత్తాతయని, పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని అయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సంక్షేమ పాలన రావాలని, వచ్చేది వైఎస్ఆర్ ప్రభుత్వమే అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎస్ సి, ఎస్ టి, బీసీ, మైనారిటీ జిల్లా అధ్యక్షులు, మహిళ అధ్యక్షురాలు, యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.