వైకుంఠ ద్వారదర్శననికి 5 లక్షల టోకెన్లు జారీ…

271

వైకుంఠ ద్వారదర్శననికి 5 లక్షల టోకెన్లు జారీ…

దేవదేవునికి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశాం..అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుమల 26 డిసంబర్

తిరుమలలో జనవరి 2 నుంచి 11 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. దర్శన టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తామని సీనియర్‌ అధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. వైకుంఠ ద్వారదర్శన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 9 చోట్ల జనవరి 1న సర్వదర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. రోజుకు 50 వేల చొప్పున 10 రోజులకు 5 లక్షల టోకెన్లు జారీ చేస్తామని,10 రోజుల కోటా పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా టోకెన్లు ఇస్తామన్నారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌, తిరుపతి రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, రైల్వేస్టేషన్‌ వెనకున్న 2, 3 సత్రాలు, ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్‌, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, భైరాగి పట్టెడలోని రామానాయుడు మున్సిపల్‌ హైస్కూల్‌, ఎంఆర్‌ పల్లి జడ్‌పి హైస్కూల్‌, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో టోకెన్లు ఇస్తామన్నారు. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్టు చేయాలని సింఘాల్‌ తెలిపారు. భక్తులు తితిదే వెబ్‌సైట్‌, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా టికెట్ల లభ్యతను ముందే తెలుసుకుని తిరుమల ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాలని, భక్తులు ముందుగానే వచ్చి క్యూలైన్లలో నిరీక్షించకుండా టోకెన్‌పై తమకు కేటాయించిన ప్రాంతానికి నిర్దేశించిన సమయానికి మాత్రమే రావాలని తెలిపారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి