29.2 C
Hyderabad
Friday, February 7, 2025
హోమ్తెలంగాణసమిష్టి కృషితోనే శివరాత్రి జాతర సక్సెస్: కలెక్టర్ అనురాగ్

సమిష్టి కృషితోనే శివరాత్రి జాతర సక్సెస్: కలెక్టర్ అనురాగ్

సమిష్టి కృషితోనే శివరాత్రి జాతర సక్సెస్: కలెక్టర్ అనురాగ్

యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల

దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడలో జరిగే మహా శివరాత్రి జాతర అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది కృషి, ప్రజా ప్రతినిధుల సహకారంతోనే విజయవంతం అయ్యిందనీ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వేములవాడ మహా శివరాత్రి జాతర సందర్భంగా సమర్థవంతంగా విధులు నిర్వర్తిoచిన అధికారులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్, ఆలయ అథారిటీ , రెవెన్యూ, పంచాయితీ రాజ్, మున్సిపల్, ఇంజనీరింగ్ విభాగాలు, ఐ అండ్ పి ఆర్ , ఇతర ప్రభుత్వ శాఖల క్షేత్ర స్థాయి కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించి అధికారులను అభినందించారు. అన్ని అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమిష్టి కృషితో మహా శివరాత్రి జాతరను సక్సెస్ అయ్యిందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్ , శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయం కార్య నిర్వహణ అధికారి కృష్ణ ప్రసాద్, ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు, DSP నాగేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్