సాంఘిక సంక్షేమ గురుకల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు..
సిరిసిల్ల: 9 యదార్థవాది ప్రతినిది
వేములవాడ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల 2023-24 ప్రవేశాల కోసం అర్హత పరీక్ష టి TGUGCET 2023 కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కళాశాల ప్రిన్సిపల్ ఎస్ పద్మజ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల
పోస్టర్ను ఆవిష్కరించారు. జనవరి 5నుండి, ఫిబ్రవరి 5వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినీలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు www.tswreisac.in వెబ్ సైట్ సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా కోఆర్డినేటర్ జాక్రిన్, కళాశాల ప్రిన్సిపాల్ పద్మజ, కళాశాల అధ్యాపకుల బృందం పాల్గొన్నారు.