సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
సిద్ధిపేట యదార్థవాది
రంగదాంపల్లి చౌరస్తా వద్ద ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు దుర్మరణం పాలయ్యారు. వీరిని చిన్నకోడూరు మండలం మైలారం వాస్తవ్యులు గా భావిస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృత దేహాలను అక్కడి నుండి తరలించే పనిలో నిమగ్నమయ్యారు..