సైబర్ మోసాలతో జాగ్రత్త..కమిషనర్
రామగుండం 24 డిసెంబర్ 22
లాటరి, లోన్ యాప్, సైబర్ మోసాలు,ఫోన్లకు మెసేజ్ రాగానే NCRP portal (www.cybercrime.gov.in) లో తక్షణమే ఫిర్యాదు చేసి టోల్ ఫ్రీ నెంబర్ 1930 తక్షణమే కాల్ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం సమాజంలో తొందరగా డబ్బు సంపాదించాలని చూస్తున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మచ్చి జీతం సరిపోక పార్ట్ టైం జాబ్స్ , మహిళ లు కాలి సమయం లో పార్ట్ టైం జాబ్ కోసం వెతుకుతూ సైబర్ నేరగాళ్లు చేతికి చిక్కుతూ ఉంటారు. కొంతమంది మోసగాళ్లు మీ తక్షణ అవసరాలను గుర్తించి, రుణం తీసుకోవడానికి ముందుగా మీరు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని రుణం మంజూరు చేయడానికి డబ్బులు అడగడం అంటే స్కామ్ అని గుర్తించాలని అన్నారు.