21.7 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్స్వాతంత్ర్య దినోత్సవ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం..

స్వాతంత్ర్య దినోత్సవ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం..

స్వాతంత్ర్య దినోత్సవ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం..

-తెలుగు ప్రతిభావంతులకు ప్రధానోత్సవం

-వేదిక హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ

హైద్రాబాద్ యదార్థవాది ప్రతినిది

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతిభావంతులకు ప్రతి సంవత్సరం ప్రదానం చేసే పురస్కారాలకు ప్రముఖ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ అర్పిత దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డా.గణగళ్ళ విజయ్ కుమార్ తెలిపారు.. విద్య, వైద్యం, విధి నిర్వహణ, సమాజ సేవ, నృత్యం, కళ, క్రీడ, సాహిత్యం, చిత్రలేఖనం, పర్యావరణ పరిరక్షణ, శాస్త్రీయ సంగీతం (నాదస్వరం, డోలు, సాక్సోఫోన్, గాత్రం) ఆధ్యాత్మికం, ఉపాధి కల్పన తదితర రంగాల్లో ప్రతిభ గల వ్యక్తులు, చిన్నారులు అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరిగే ఎంపిక ప్రక్రియలో భాగంగా రాష్ట్ర స్థాయి ‘ఆంధ్ర రత్న’ ‘తెలంగాణ రత్న’ ‘ స్టేట్ బెస్ట్ సిటిజన్ ‘ అవార్డులతో పాటు, ఇద్దరు అత్యుత్తమ ఉపాధ్యాయులకు ‘డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్’ ఇతర రంగాల్లో సేవలందించిన పదిమందికి ‘నేషనల్ బెస్ట్ సిటిజన్’ మరియు ‘ లైఫ్ టైం అచీవ్ మెంట్ ‘ అవార్డులను అందజేయనురని, అంతేకాకుండా, అభ్యర్థుల కేటగిరీల వారీగా ‘కళాబంధు’, ఎన్టీఆర్ స్మారక ‘కళా విభూషణ్’ డాక్టర్ సీ.నా.రే స్మారక ‘సాహిత్య కళానిధి’, ప్రముఖ నృత్య కళాకారులకు ‘సిద్ధేంద్రయోగి నాట్య కళా విశారద’ జాతీయ అవార్డులతో పాటు ఏదైనా మూడు రంగాల్లో విశేష ప్రతిభ గల ఇద్దరికి భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ” భారత ప్రతిభా రత్న ” ప్రతిష్ఠాత్మక పురస్కారం అందజేయనున్నామని వివరించారు. ఆసక్తి, ప్రతిభ ఉన్నవారు తమ దరఖాస్తులను 7780589775 వాట్సాప్ నెంబర్ కు ఆగష్టు 7వ తేదీ లోగా పంపుకోవాలన్నారు. ఎంపికైన వారికి ఆగస్టు 28వ తేదీన హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో అవార్డులను సినీ, రాజకీయ, అధికార ప్రముఖుల చేతుల మీదుగా ప్రధానం చేయనున్నామని డా.గణగళ్ళ విజయ్ కుమార్ వివరించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్