24.7 C
Hyderabad
Thursday, May 22, 2025
హోమ్తెలంగాణఅంజన్న అనుగ్ర‌హంతో మనమందరం సుభిక్షంగా ఉండాలి..

అంజన్న అనుగ్ర‌హంతో మనమందరం సుభిక్షంగా ఉండాలి..

అంజన్న అనుగ్ర‌హంతో మనమందరం సుభిక్షంగా ఉండాలి..

కొండ‌గ‌ట్టు ఆంజ‌నేస్వామి అనుగ్ర‌హంతో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ సుభిక్షంగా ఉండాల‌ని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆకాంక్షించారు..

జగిత్యాల యదార్థవాది

కొండ‌గ‌ట్టు ఆల‌యంలో బుధవారం ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత
ప్ర‌త్యేక పూజ‌లు చేసిన అనంత‌రం, అక్క‌డ నిర్వ‌హించిన హ‌నుమాన్ చాలీసా పారాయ‌ణంలో పాల్గొన్నారు..
హ‌నుమాన్ చాలీసా పారాయ‌ణం ముగిసిన అనంత‌రం ఆమె మాట్లాడుతూ మంచి జీవితాన్ని ప్ర‌సాదించేట‌టు, ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేట‌టువంటి, విజ‌యాన్ని అందించే ఆంజ‌నేయ స్వామిని కొలిచిన‌ట్టు అయితే ప్ర‌జ‌లంద‌రూ సుభిక్షంగా ఉంటార‌ని మ‌నంద‌రం బ‌లంగా న‌మ్ముతామని ప్ర‌తి గ్రామంలో ఆంజ‌నేయ‌స్వామి గుడి ఉంటుందని క‌రోనా క‌ష్ట‌స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌జ‌లంద‌రూ సుభిక్షంగా ఉండాలంటే హ‌నుమాన్ పారాయ‌ణం చేయాల‌ని కొండ‌గ‌ట్టు ఆలయ పూజారి జితేంద్ర‌య్య సూచించారని తెలిపారు.
ఆంజ‌నేయ స్వామి పారాయ‌ణానికి మించిన మందు లేదని ఆనాటి నుండి నేటి వ‌ర‌కు కొండ‌గ‌ట్టు అంజ‌న్న సేవా స‌మితి పేరుతో జితేంద్ర‌య్య నేతృత్వంలో అంద‌రం కూడా పారాయ‌ణం చేస్తున్నామని అమే తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్