అందత్వ నివారణ మన లక్షం..
గజ్వేల్ యదార్థవాది
కంటి వెలుగు కార్యక్రమం చారిత్రాత్మకమని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు..సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 18వ వార్డ్ లో శుక్రవారం స్థానిక జిడిఆర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ ఎన్సీ.రాజమౌళి ప్రారంభించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మానస పుత్రిక కంటి వెలుగు చరిత్రలో నిలిచిపోతుందని దేశంలో ఎక్కడా లేనివిధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చి అందత్వ నివారణ కోసం నిరుపేదల కళ్ళల్లో వెలుగులు నింపడానికి కంటి వెలుగు కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అన్నారు. సీఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని మండు వేసవిలో చెరువులు నిండుకుండల కళకళలలాడుతు కాలేశ్వరం ప్రాజెక్టుతో నీటి గోస తీర్చిన ఘనత సీఎం కెసిఆర్ కే దక్కిందని రాబోయే రోజుల్లో బి ఆర్ ఎస్ పార్టీ భారత దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రజలకు సుపరిపాలన అందించడం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో సిద్ధిపేట జిల్లా యువజన అధ్యక్షులు ఎన్సీ.సంతోష్ గుప్తా,18వ వార్డ్ బీఆర్ఎస్ అధ్యక్షులు గొంగల్ల శ్రీను, శ్రీధర్, అమరేందర్, కొమురవెల్లి ప్రవీణ్, రాజారామ్, మెడికల్ ఆఫీసర్స్, మెప్మా సిబ్బంది,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..