అకాల వర్షాలతో నష్టపోయి పంటలను
క్షేత్ర స్థాయిలో పరీశిలించిన .. జిల్లా కలెక్టర్
సిద్దిపేట యదార్థవాది
సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి చేర్యాల
మండలంలోని ఐనాపూర్ పోసాన్ పల్లి
పెద్దరాజ్ పేట పోతిరెడ్డిపేట గ్రామాలలో
అకాల వర్షాలతో నష్టపోయి పంటలను సోమవారం క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతా రెండు రోజులు జిల్లాలో ముఖ్యంగా కొమురవెల్లి చేర్యాల మండలాల్లో వడగండ్ల వాన వల్ల వరి పంటలకు తీవ్రంగా నష్టం జరిగిందని యుద్ధ ప్రాతిపదికన నష్టపోయిన వరి పంటల వివరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచిందని అదే పద్దతిలో వ్యవసాయశాఖ తరపున ఎడిఎ, ఎఈఓ, ఇతర అధికారుల ఆద్వర్యంలో ఈ రెండు మండలాల్లో 12నుండి 15గ్రామాల్లో వరి పంటనష్ట వివరాలను పారదర్శపద్దతిలో సేకరిస్తారని తెలిపారు. దెబ్బ తిన్న వరి పంట వివరాలను విస్తీర్ణం, సర్వే నెంబర్ వారిగా రెండు రోజులు గ్రామపంచాయతీలలో అతికిస్తారని ఎ రైతులకు ఎంత నష్టం జరిగిందో ప్రతి ఓక్కరు చుస్తారని నష్టపోయిన అర్హత ఉన్న రైతు వివరాలను సేకరించి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే అర్హత లేని రైతులను లిస్ట్ నుండి తోలగించుతారు. వ్యవసాయ శాఖతో పాటు మామిడి ఇతర పండ్ల తోట సంబందించి ఉద్యాన వన శాఖ ఐనాపుర్ గ్రామంలోనే సుమారుగా 10 నుండి 15వ వరకు ట్రాన్స్ ఫార్మర్ లు కలిపోయినవి కావున విద్యుత్ శాఖ ఎస్సీ, ఎడి ఈరోజు, రేపు వచ్చి వివరాలను సేకరించాలని ఆదేశించారు. నష్టపోయిన కౌలు రైతులకు సంబందించి ప్రభుత్వం తప్పనిసరిగా మంచి నిర్ణయం తిసుకుంటుందని రైతుల వారిగా ధరణి పోర్టల్ ఉన్న నంబర్ ల ఆధారంగా పై అధికారులకు పంట నష్ట వివరాలను అందించడం జరుగుతుందని ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపుగా 2000 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగిందని ఈ రెండు మూడు రోజుల్లో వ్యవసాయ శాఖ అధికారులు దెబ్బ తిన్న వరి పంట వివరాలలో స్పష్టత వస్తుంది. ప్రభుత్వం ఎ ఓక్క రైతుకు కుడా అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. కలెక్టర్ వెంట వ్యవసాయ శాఖ ఎడిఏ, స్థానిక ఎఈఓలు, తహసిల్దార్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, సర్పంచ్ లు అధికారులు పాల్గొన్నారు.