అక్రమ వడ్డీ వ్యాపారుని అరెస్ట్.
-భారత రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు పాటించాలి..
-నిబంధనలకు లోబడి చిట్టి, వడ్డీ వ్యాపారం చేసుకోవచ్చు..
-అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం..
-చిట్ ఫండ్ వ్యాపారులు పద్దతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవు..
-సిరిసిల్ల రూలర్ సర్కిల్ ఇన్స్పెక్టర్..
సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది
భారత రిజర్వ్ బ్యాంక్ వారి నిబంధనలు అక్రమించి అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిని కటకటాల వెనక్కు పంపిస్తామని సిరిసిల్ల రూలర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాలపల్లి మండల పరిధిలోని సారంపల్లి గ్రామంలో మునిగెల అంజయ్య అక్రమ అధిక వడ్డీ వ్యాపారం చేస్తునడని సమాచారంతో సిరిసిల్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు సిబ్బంది తో కలసి దాడులు జరిపి అంజయ్య ఇంట్లో ఉన్న ప్రాంసరి నోట్స్, బాండ్ పేపర్స్, వాహనాలు, సాధబైనమా పేపర్స్, బుక్స్, నగదు స్వాధీనం చేసుకొని అంజయ్యపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని, అతని వద్ద స్వాధీనపరుచుకున్న వాటి వివరములు ఈ విధంగా ఉన్నాయి. 10 బాండ్ పేపర్స్ విలువ రూ. 20,72,064/-, 8 ప్రంసరి నోట్స్ విలువ రూ. 4,61,000/-, 21సాధబైనమా పత్రాలు పుస్తకాలు విలువ రూ. 20,90,300/-, నగదు రూ. 1,50,000/-, ఒక ద్విచక్ర వాహనం, ఒక ట్రాక్టర్ స్వాధీన పరచుకున్నట్లు మంగళవారం ఆయన పత్రిక ప్రకటనలు తెలిపారు.. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో దాడులు యధాతథంగా కొనసాగుతూనే ఉంటాయని, ఇకనైనా అక్రమ వడ్డీ వ్యాపారులు, చిట్ ఫండ్ వ్యాపారులు తమ పద్దతి మార్చుకోకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, హెచ్చరించారు. అప్పు తీసుకోవడం, ఇవ్వడం నేరం కాదు కానీ భారత రిజర్వుడు బ్యాంక్ నియమనిబందనలకు అనుగుణంగా మలుచుకోవాలని, తెలంగాణ మని లెండింగ్ చట్టంలోని నిబందనల ప్రకారం చట్ట బద్దంగా ఎవరైనా లైసెన్స్ తొ అప్పులు ఇవ్వవచ్చు, తీసుకోవచ్చు. కాని చట్ట విరుద్ధంగా, అధిక వడ్డీ రేట్లతో సామాన్యుల పై దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ టాస్క్ లో సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.