అక్షర ఫౌండేషన్ కార్యవర్గం ఎన్నిక
సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 15:
అక్షర ఫౌండేషన్ సూర్యాపేట కార్యవర్గం 2025 ఎన్నికలు అక్షర ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అధ్యక్షులుగా ఉప్పు నాగయ్య’ ప్రధాన కార్యదర్శిగా రుద్రంగి కాళిదాసు, కోశాధికారిగా యాస శృతి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అక్షర ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ యాస రాంకుమార్ రెడ్డి తెలిపారు. అక్షర ఫౌండేషన్ 2008 సంవత్సరంలో స్థాపించామని, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కార్యవర్గం ఎన్నికలు ఉంటాయని, ఈ కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుందని తెలిపారు. మా అక్షర ఫౌండేషన్ విద్య,వైద్య, క్రీడా, సాంస్కృతిక,సామాజిక, పర్యావరణ రంగాలలో సేవలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యవర్గ సమావేశంలో నరాల తిరుమలరెడ్డి, నెల్లుట్ల పాపయ్య, వై.సుభాష్ చంద్రబోస్, వీర్లపాటి వెంకన్న, సోల్లేటి ఉపేంద్ర చారి, షేక్ నజీర్ బాషా, మడూరి హనుమాచారి, కె సైదులు ధరావత్ లకుపతి, ధరావత్ వీరాసింగ్, రాచకొండ నాగయ్య, మద్ది వినయ్ రెడ్డి షేక్ యూసఫ్, అనుమల వెంకటేశ్వర్లు మొదలగువారు పాల్గొన్నారు.