అట్టహాసంగా సాగిన సింగరాయ జన జాతర
హుస్నాబాద్, యదార్థవాది ప్రతినిధి, జనవరి 29: ప్రసిద్ధి చెందిన ప్రతాపరుద్ర సింగరాయ జాతర సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో కూరెళ్ల తంగేళ్లపల్లి గుండారెడ్డిపల్లి గ్రామాల పసర ప్రాంతాల కొండలలో బుధవారం అట్టహాసంగా జరిగింది. ఈ సంవత్సరం జాతరకు గతం కంటే అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ప్రత్యేకతను సంతరించుకున్నా డు. ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ ప్రతాపరుద్రుడు మండలంలోని తూర్పు నుండి పడమర దిశగా ప్రవహిస్తున్న మోయతుమ్మెద వాగుపై భారీ చెరువును నిర్మించడానికి స్థలాన్ని పరిశీలించడానికి తన ఆస్థానంలోని సింగరాయడు అనే వాస్తుశిల్పిని పంపించాడు కొండపై పూర్వకాలంలో గుహలో వెలసిన లక్ష్మీనరసింహస్వామిని దర్శించకున్న అనంతరం సింగరాయ అక్కడి ప్రదేశాల్ని పరిశీలిస్తూ ఎతైన కొండలు దట్టమైన అడవి మధ్యలో నుండి తూర్పు నుండి పడమర దిశగా ప్రవహించే మోయతుమ్మెద వాగు చూడముచ్చటైన ప్రకృతి అందానికి ముదుడై అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. అందుకే ఈ ప్రదేశానికి ఓరుగల్లులు పాలిస్తున్న ప్రతాపరుద్రుని పేరు కలుపుకొని ప్రతాపరుద్ర సింగరాయ జాతర అని ఈ ప్రదేశానికి పేరు వచ్చింది సింగరాయడి కాలం నుంచే ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ప్రతి ఏటా పుష్య బహుళ అమావాస్య (మాఘ అమావాస్య) రోజు జాతర వైభవంగా జరుగుతుంది. పడమర దిశగా నదీ ప్రవాహం ఉన్నందున కొండ కోనల్లో చెట్ల మధ్యలో నుంచి ఆయుర్వేద వనమూలికలతో ప్రవహిస్తున్న ఈ నదిలో స్నానం చేస్తే శరీర రుగ్మతలు తొలగి ఆరోగ్యంగా ఉంటారని ప్రసిద్ధి, అడవి లో కాలినడక కొండగుహలో కొలువుదీరిన లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. స్వామిని రాష్ట్రంలోని పలు జిల్లాల నుండే కాక మహారాష్ట్రలోని ముంబయి, షోలాపూర్, పూనే, బివాండీ, కర్ణాటక బీదర్ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఇక్కడ శాఖాహార వంటలు వంకాయ టమాట చిక్కుడుకాయ చెమట ప్రత్యేకతను సంతరించుకున్నాయి, ఆలయాల్లో జరిగే జాతరలు సాధారణంగా రెండుమూడు రోజులు కొనసాగుతాయి. కానీ సింగరాయ జాతర ఇందుకు భిన్నంగా కేవలం ఒక్కరోజు సూర్యాస్తమయం తర్వాత తరువాత స్వామికి తలనొప్పి వస్తుందని భక్తులు దర్శనం చేసుకోరు. రాత్రి వరకు ఆ ప్రాంతం నుంచి అందరూ వెళ్లిపోతారు. ఆలయ పరిసరాల్లో మద్యం, మాంసం తీసుకోవడం పాపమని భక్తులు నమ్ముతారు. అందుకే జాతరకు వచ్చిన భక్తులు వాగు ఒడ్డున శాఖాహార వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేస్తారు. కోహెడ మండలం కూరెళ్ల, తంగళ్లపల్లి, బస్వాపూర్, గుండారెడ్డిపల్లి గ్రామాల శివార్ల మధ్యలో గుట్టల్లో ఆలయం ఉంటుంది. బస్వాపూర్, కూరెళ్ల, తంగళ్లపల్లి, గుండరెడ్డిపల్లి గ్రామాల నుంచి వేర్వేరుగా ఆలయానికి దారులున్నాయి. ఎటునుంచి వచ్చినా రెండు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. కూరెల్ల గ్రామ పంచాయతీ తంగళ్ళపల్లి గ్రామపంచాయతీ ల మధ్యన వివాదాలు ఉన్నందున ఈసారి జాతరను ప్రభుత్వమే కొనసాగించింది. లక్ష్మీనరసింహస్వామి వెలసిన గుహను సన్యాసుల మఠంగా పిలుస్తారు. కూరెళ్ల నుంచి స్వామిని దర్శించుకునేందుకు వచ్చేదారిలో ఆంజనేయుడు, కాలబైరవుడి విగ్రహాలు కనిపిస్తాయి. ఆలయం చుట్టుపక్కల ప్రాచీన చరిత్రకు సంబంధించిన అనేక ఆనవాళ్లు లభించాయి. ఆదిమ మానవుడి ఆవాసాల ఆనవాళ్లను పరిశోధకులు గుర్తించారు. బౌద్ద మతానికి సంబంధించిన చతుర్ముఖబ్రహ్మ విగ్రహం, గాజు పరిశ్రమ అవశేషాలు, రాకాసిగూళ్లు బృహత్ శిలాయుగపు సమాధులు కనిపిస్తాయి. వీటి ఆధారంగా మోయతుమ్మెద వాగు పరీవాహక ప్రాంతంలో వేల సంవత్సరాలుగా మానవుడు జీవనం సాగించనట్టు చరిత్రకారలు నిర్దారించారని చరిత్ర చెప్తుట్టారు.
