22.7 C
Hyderabad
Wednesday, July 2, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్అనంతమైన సంపద వున్నా…ఈ దౌర్భాగ్యనికి కారణం బీజేపీ, కాంగ్రెస్ లే! సిఎం కెసిఆర్

అనంతమైన సంపద వున్నా…ఈ దౌర్భాగ్యనికి కారణం బీజేపీ, కాంగ్రెస్ లే! సిఎం కెసిఆర్

అనంతమైన సంపద వున్నా…ఈ దౌర్భాగ్యనికి కారణం బీజేపీ, కాంగ్రెస్ లే.! సిఎం కెసిఆర్

ఖమ్మం: యదార్థవాది ప్రతినిది

బిన్నమైన మూడు వాతావరణాలు, కష్టించే మానవ సంపద, కోట్ల ఎకరాల సాగు భూమి, వేల టీఎంసిల జలరాశి, అనతంమైన సూర్యరశ్మి, విశాల తీరం ఉన్న మనదేశం ఎవరినో అడుక్కోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకోచిందని, ఈ దుర్మార్గానికి కారణభూతులు కాంగ్రెస్, బీజేపీ లే కారణమని బుదవారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.. ప్రపంచస్థాయి బెస్ట్ ఫుడ్ చైన్ గా ఉండాల్సిన మనం కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకోవడం విచారకరం కాదా? పామాయిల్ మనమే ఉత్పత్తి చేసుకోలేమా? అని ప్రశ్నించారు. 75 సంవత్సరాల తర్వాత కూడా దేశప్రజలకు రక్షిత మంచినీరు ఇవ్వలేమా? ఎవరి పాపం ఇది? అని అడిగారు. ఇవన్నీ సాధించడానికి పుట్టిందే బీఆర్ఎస్ అని ఉద్గాతించారు. దేశంలో 4,10,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉండీ … 2,10,000 మించి వాడడంలేదని, పంచాయితీలు పెట్టి ఉత్పాదక లేకుండా చేస్తున్నారని అన్నారు. ఉచితాల పేరుతో రైతులు, పెదలనూ అవమానిస్తున్నారు. భారతదేశం అంతా 24 గంటలు కరెంటు ఇచ్చినా లక్ష కోట్లకు మించి ఖర్చు కాదని, దీనికి మాత్రం మోడీకి మనసు రాదని అన్నారు. తెలంగాణ రైతుబంధు, 24 గంటల కరెంటు దేశమంతా ఇవ్వడం బీఆర్ఎస్ విధానమాని కెసిఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, డిల్లి ముఖ్యమంత్రి కేజ్రివాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్, సిపిఐ జాతీయ నేత డి రాజ మాట్లాడారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్