అనాధ అమ్మాయి పెండ్లికి ఆసరాగా పుస్తె మట్టెలు
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామంలో వేల్పుల అమ్ములు తండ్రి లక్ష్మీనారాయణ తల్లిదండ్రులు మరణించడంతో జూన్ 1వ తేదీ రోజున వివాహ మహోత్సవం సందర్భంగా బుధవారం పెద్దమనుషుల సమక్షంలో గుండ ప్రభాకర్ ఆధ్వర్యంలో పుస్తె మట్టెలు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో కోహెడ విశాల పరపతి సొసైటీ డైరెక్టర్ గుండ తిరుపతి కానిశెట్టి రాములు టీటీడీపీ దళిత విభాగం మాజీ రాష్ట్ర కార్యదర్శి చింతకింది సింగరయ్య కుల పెద్దమనిషి వేల్పుల పెద్దరాజయ్య వేల్పుల వెంకటయ్య మాజీ వార్డు సభ్యులు కనగండ్ల కుమార్ అంగన్వాడి టీచర్ కనగండ్ల ముత్యాలు వేల్పుల భాస్కర్, శ్రీనివాస్, కుటుంబ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.