అప్పుల బాధలతో యువకుడు మృతి.
కుకునూర్ పల్లి /కొండపాక యదార్థవాది
కుకునూరు పల్లి మండల, గ్రామంలో కొంతం మహిపాల్ అప్పుల బాధలతో ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందడు.. మృతునికి మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ, ట్రాక్టర్ నడుపుకుంటూ కుటుంభాన్ని పోచిస్తూ ఉన్నాడు.. వ్యవసాయంలో పంటలు సరిగా పండక, ట్రాక్టర్ వల్ల కూడా అప్పుల పాలయ్యాడు, చేసిన అప్పు తీర్చే మార్గం దొరుకక మనస్థాపంతో కలతచెంది, ఎప్పటిలాగే భార్య పిల్లలతో భోజనం చేశాక భార్యా పిల్లలు ఒక రూమ్ లో మృతుడు ఒక రూమ్ లో పడుకున్నాడని, నివారం తెల్లవారుజామున మహిపాల్ భార్య నిద్ర లేచి మహిపాల్ నిద్ర లేపేందుకు వెళ్లగా ఎంత పిలిచినా డోర్ తీయకపోయేసరికి ఇంటి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి రూమ్ డోర్లు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా చీర తో ఉరివేసుకొని మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం గజ్వెల్ ప్రభుత్వ దవాఖానకు పంపించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని కుకునూరుపల్లి ఎస్సై పుష్పారాజ్ తెలిపారు..