అభివృద్ధి కేంద్రాలు. గ్రామపంచాయతీ భవనాలు
-గోవర్ధనగిరి గ్రామ గ్రామపంచాయతీ భవనం ప్రారభించిన ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్..
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఈరోజు 16 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవర్ధనగిరి గ్రామంలో ఎంతో ప్రాశస్త్యంగల సంజీవరాయ గుట్ట ఉన్నదని కోరిన కోరికలు తీర్చే దేవుడు సంజీవరాయ దేవుడని అన్నారు రానున్న కాలంలో తలాపున గౌరవెల్లి, సంజీవరాయ గుట్టతో గోవర్ధనగిరి గ్రామం మంచి పర్యాటక స్థలంగా మారనున్నదని, గోవర్ధనగిరి గ్రామంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నదని హుస్నాబాద్ సభలో మంత్రి కేటీఆర్ ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రామం యొక్క సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రచించే కేంద్రాలు గ్రామపంచాయతీ భవనాలని ప్రతి గ్రామానికి గ్రామపంచాయతీ భవనం గుండెకాయ లాంటిదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామానికి పంచాయతీ భవనాలు పంచాయతీ గ్రామనిర్వహణ కోసం ట్రాక్టర్లు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, సిసి రోడ్లు మురుగునీటి కాలువలు, సామాజిక భవనాలు, విద్యాలయాలు ఇలా ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని, సీఎం కేసీఆర్ అన్నట్టు పల్లెలు ప్రగతికి పట్టుకొమ్మలని, పల్లెలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అందుకోసం సబ్బండ వర్గాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు నిర్వహిస్తూ దేశంలో ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నామని, బొడిగపల్లె నుండి గోవర్ధనగిరి గ్రామం మీదుగా బంజేరుపల్లి వరకు రోడ్డు నిర్మాణం, బతుకమ్మ ఘాట్ నిర్మాణం, దుర్గమ్మ గుడి నిర్మాణం చేపడుతామని ఎమ్మెల్యే తెలిపేరు. గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికారులు,బీఅర్ఎస్ కార్యకర్తలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.