31.2 C
Hyderabad
Friday, May 23, 2025
హోమ్తెలంగాణఅర్బన్ పార్కును ఏకోటూరిజంలను ఏర్పాటు చేస్తాం

అర్బన్ పార్కును ఏకోటూరిజంలను ఏర్పాటు చేస్తాం

అర్బన్ పార్కును ఏకోటూరిజంలను ఏర్పాటు చేస్తాం

అటవి పర్యావరణ, దేవాలయ శాఖ మంత్రి కొండా సురేఖ

వెల్దుర్తి /నర్సాపూర్, యదార్థవాది, డిసెంబర్ 14: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ సమీపంలో గల అర్బన్ పార్క్ నకు అటవీ  పర్యావరణం  దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ పర్యటించారు ఆమెను అర్బన్ పార్క్ వద్ద స్వాగతం పలికి, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ గురుస్వామి అశోక్ గౌడ్  మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించడం జరిగిందని నర్సాపూర్ అర్బన్ పార్కును మరింత అభివృద్ధి చేస్తామని  ఏకో టూరిజం ఏర్పాటు చేస్తామని అర్బన్ పార్కులు పర్యాటకులు అధిక సంకలో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు నరసాపూర్ నగర సమీపంలో ఉన్న అడుగులు ఆహ్లాదంగా కనిపిస్తున్నాయని అర్బన్ పార్కులో పచ్చడి చెట్లు వాచ్ టవర్ గార్డెన్ వంటివి ఏర్పాటు చేయడంలో పర్యాటకులు సందర్శిస్తూ మంచి వాతావరణంలోని ఆస్వాదిస్తారని ఇలాంటి వాతావరణాన్ని తాను సందర్శించడం ఎంతో సంతోషకరమని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు అనంతరం మంత్రిగారికి నర్సాపూర్ పురపాలక సంఘానికి గత ప్రభుత్వంలో మంజూరై నిధులు  టి యు ఎఫ్ ఐ డి సి నిధులు 30.95 లక్షలు ఎస్ డి ఎఫ్ నిధులు 25 కోట్లు మంజూరు చేయుటకు అవసరమగు చర్యలు తీసుకొనుటకు గాను వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు జిల్లా గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి  రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్గా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ డీఎఫ్ఓ జాజి ఆర్డీవో భూపాల్ రెడ్డి ఎమ్మార్వో శ్రీనివాసరావు కమిషనర్ రామకృష్ణారావు  ముఖ్య నాయకులు కార్యకర్తలు  మున్సిపల్ సిబ్బంది నర్సాపూర్ నియోజకవర్గంలోని ఉన్నటువంటి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్