అవగాహనతోనే కుష్టు వ్యాధి అంతం…
జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అజిముద్దీన్..
యదార్థవాది ప్రతినిధి నంగునూరు
అవగాహన ద్వారానే కుష్టు వ్యాధిని అంతం చేయొచ్చని లెప్రసీ ప్రోగ్రాం జిల్లా అధికారి డాక్టర్ అజిముద్దీన్ అన్నారు.
గాంధీ మహాత్ముని వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో కుష్టు వ్యాధిపై ఏర్పాటుచేసిన అవగాహన సమావేశం లో పాల్గొని మాట్లాడారు. లెప్రసీ వ్యాధిగ్రస్తుల పట్ల ఆదరాభిమానాలు చూపాలని తెలిపారు. కుష్ఠు వ్యాధి పాపం వలన శాపం వల్లనో రాదనిఇ ది ఒక బాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి అని చెప్పారు. వ్యాధిని ప్రాథమికంగా గుర్తించినట్లయితే అంగవైకల్యం రాకుండా కాపాడవచ్చు అన్నారు. ఎవరి శరీరం మీద నైనా స్పర్శ లేని మచ్చలు ఉన్న . కాళ్లు చేతులు మెద్దుబారినట్లు ఉన్న, మోకాలు మోచేతుపై బొడిపెలు ఉండి స్పర్శ లేకపోతే వెంటనే అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలన్నారు. కుష్టు వ్యాధిని ఎం డి టి చికిత్స ద్వారా పూర్తిగా నయం అవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 85 మంది వ్యాధితో బాధపడుతూ మందులు వాడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వ్యాధి నివారణ పై ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ సర్పంచ్ అబ్దుల్ అజిత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీటీసీ బాబు,ఏపీ ఎం ఓ లక్ష్మన్, జిల్లా డిపిఎంవో కృపలాదేవి, స్థానిక వైద్యాధికారులు డాక్టర్ ప్రవీణ్ నాయక్, డాక్టర్ అంజలి రెడ్డి, డాక్టర్ శివకృష్ణ, పి హెచ్ ఎన్ హేమలత, హెల్త్ అసిస్టెంట్ లింగంగౌడ్, భాస్కర్ భట్లు, ఏఎన్ఎం పద్మ, తదితరులు పాల్గొన్నారు.