అవినీతిపై వినూత్న ప్రచారనికి శ్రీకారం చుట్టిన హైదరాబాద్ ప్రజలు
ఈ శతాబ్దపు అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్ట్
కాళేశ్వరం ఏటీఎంపై కాళేశ్వరం కరప్షన్ రావు కేసీఆర్ ఫొటో..
హైదరాబాద్ యదార్థవాది ప్రతినిది
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై వినూత్న ప్రచారాన్ని ప్రారంభించిన ప్రజలు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అవినీతిని ఎండగడుతూ ప్రత్యేక కాళేశ్వరం ఏటీఎంలను హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో ఆవిష్కరించారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలను ఎలా దుర్వినియోగం చేసిందో తెలియజేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఇటీవల పిల్లర్లు కుంగిపోయాయిన విషయం తెలిసినదే.. సుమరు లక్ష కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కట్టిన నాలుగు సంవత్సరాలకే పిల్లర్లు కుంగిపోవడంపై ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుని కేసీఆర్ కుటుంబం సభ్యులు అవినీతికి పాల్పడ్డారని పలు పార్టీల రాష్ట్ర, జాతీయ నేతలు అనేక సార్లు విమర్శించారు.. కోట్ల రూపాయల అవినీతిని ఎత్తిచూపేలా, ఏటీఎం నుండి లక్ష కోట్ల రూపాయల నోటు బయటికి రావడం అందరినీ ఆకర్షిస్తోంది. ఏటీఎంపై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ సంతోష్ రావు ఫొటోలు పొందుపరిచారు ఈ ఏటీఎంలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి…