31.2 C
Hyderabad
Friday, May 23, 2025
హోమ్తెలంగాణఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు కేసులకు విముక్తి.!

ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు కేసులకు విముక్తి.!

ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు కేసులకు విముక్తి.!

-మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 12: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ ఉద్యోగుల సర్వీసు కేసుల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసినట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గురువారం ఆయన కార్మికుల, ఉద్యోగుల ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ చైర్మన్ గా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య సభ్యులుగా ఈ త్రిసభ్య కమిటీ పనిచేయనుందని, రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ లో విధుల్లో ఉన్న ఉద్యోగుల్లో గతంలో సర్వీస్ రిమూవల్ కేసులు నమోదైన వాటిపై  ఈ కమిటీ పరిశీలించనుందని, ఇప్పటికే ప్రజావాణి లో ఆర్టీసీ కి సంబందించిన సర్వీస్ రిమువల్, తదితర కేసుల విషయమై ఫిర్యాదులను ఈ త్రిసభ్య కమిటీ పిలిచి రివ్యూ చేయనుందని, ఈ త్రిసభ్య కమిటీ కేసులో ఉన్న మెరిట్స్ ను బట్టి ఆర్టీసీ యాజమాన్యానికి రికమెండ్ చేయనుందని మంత్రి పొన్నం తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్