ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల చేతివాటం!
యదార్థవాది ప్రతినిధి
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారంటీ లో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఉద్ధేశ్యంతో మొదలు పెట్టిన కార్యక్రమాన్ని కొందరు అధికారులు నీరుగారుస్తూనారు. 100 శాతం ఆక్యుపెన్సీ రేషియో పెంచడం కోసం మహిళా ప్రయాణికులు ఎక్కిన దాని కన్నా ఎక్కువ జీరో టిక్కెట్లు కొడుతున్న ఆర్టీసీ కండక్టర్లు.ఉత్తి పుణ్యానికి జీరో టిక్కెట్లు కొడుతూ ప్రభుత్వం ధనం వృధా చేస్తున్న కండక్టర్లు మహబూబ్ నగర్ నుండి తాండూరు వెళ్తున్న టీఎస్ 34టీఏ 5189 బస్సులో కండక్టర్ గండీడ్ జానంపల్లి స్టేజీల వద్ద మహిళా ప్రయాణికులు ఎక్కకపోయినా జీరో టిక్కెట్లు ప్రింట్ చేస్తుండగా ఓ ప్రయాణికుడు ఈ తతంగం అంతా ఫోన్లో చిత్రీకరించాడు.