ఆర్ కే ఎల్ కే కళాశాలలో అలరించిన పుడ్ ఫెస్టివల్
75 రకాల ఆహార పదార్థాలతో ప్రదర్శన నిర్వహించిన బీఈడీ విద్యార్థులు
సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 7: జిల్లా కేంద్రంలోని ఆర్ కె ఎల్ కె బి ఈ డి కళాశాలలో విద్యార్థులు ఆహార మహోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. కళాశాలకు చెందిన విద్యార్థులు సుమారు 75 రకాల ఆహార తినుబండారాలను ఆహార మహోత్సవంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ అంగిరేకుల రాజశ్రీ, కరస్పాండెంట్ నాగార్జున లు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ ఫుడ్ ఫెస్టివల్ ఎంతో దోహదపడుతుందన్నారు. కళాశాల విద్యార్థులంతా తమ ఇంటిలోని వస్తువులతో తయారు చేసిన రక రకాల ఆహార పదార్థాలు ఎంతో రుచికరంగా ఉన్నాయని అన్నారు. తమకు తెలిసిన విధంగా చాలా చక్కగా అన్ని రకాల ఆహార పదార్థాలను తయారుచేసి ఆహార మహోత్సవం విజయవంతానికి కృషి చేసిన విద్యార్థులను కళాశాల సిబ్బందిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రజిని, సిబ్బంది విజయ్, జానయ్య, త్యాగరాజు, సతీష్, లక్ష్మీనారాయణ, మల్లికార్జున్, నరసయ్య తో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.