ఇంటింటి ప్రచారం చేసిన సింగిల్ విండో చైర్మన్. పేర్యాల
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నాయకులు కార్యకర్తలు ముమ్మర ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా గురువారం సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండల కేంద్రంలో గ్రామ శాఖ అద్యక్షులు బండ వెంకటస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పేర్యాల దేవేందర్ రావు కార్యకర్తలు కలిసి భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేయాలని ఇదివరకు రెండుసార్లుగా ఎమ్మెల్యే గెలిచి చేసిన పలు అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి పొన్నాల లక్ష్మణ్, కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖదీర్, ఉప సర్పంచ్ యాద అశోక్, మాజీ ఎంపిటిసి తిప్పారపు నాగరాజు, మండల యువత అధ్యక్షులు జాలిగాం శంకర్, మంద రాజయ్య, లక్ష్మణ్ రావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు శంకర్, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ శాఖ యువత అధ్యక్షులు పెసరు సుధాకర్, చంద్రయ్య, రాజయ్య, బాల కొమరయ్య, యాదగిరి, సంజీవ్, నారాయణ, నర్సయ్య, రాజమౌళి, నరసయ్య, వేల్పుల రాజేశ్వరి, ఎనగందుల మంజుల, గజ్జల అమూర్తమ్మ, బందెల రాజమణి తదితరులు పాల్గొన్నారు