ఉద్యోగాల పేరిట యువతను మోసగిస్తున్న ముఠా అరెస్టు !
కరీంనగర్ యదార్థవాది
నిరుద్యోగ యువతకు ఉద్యోగాల పేరిట గాలం వేసి వారి నుండి లక్షల రూపాయలు దండుకుంటున్న, యువతను నిలువునా ముంచి, ఘరానా మోసానికి పాల్పడుతున్న ముఠాను కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.. మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామానికి చెందిన మందల భాస్కర్ పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన గంగారపు మధుమూర్తి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన బత్తిని వైకుంఠం మరో ఇద్దరితో కలిసి ఒక ముఠాగా ఏర్పడి గత కొన్ని సంవత్సరాలుగా నిరుద్యోగ యువకులను ఉద్యోగం ఇప్పిస్తామని వారి వద్ద లక్షల రూపాయలు వసూలు చేసి ముఖం చాటేస్తున్నారు. వీరి వల్ల నష్టపోయిన బాధితుడు ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ శ్రీ నటేష్ నిందితుల, ముఠాను పట్టుకోవడానికి వారి కదలికలపై నిఘా పెట్టి వారిని అదుపులోకి తీసుకునుటకు ఒక ప్రత్యేక బృందాన్ని ఎస్సై రహీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రత్యేక బృందం నిందితుల కదలికలపై నిఘా లో వారిని అదుపులోకి తీసుకొని వారిని విచారించగా వారు తమ నేరాన్ని అంగీకరించారని, గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నామని తెలిపారన్నారు నిందితుల నుండి 93 వేల రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, అరెస్టు చేసిన నిందితులు కోర్టులో హాజరు పరిచి విరి నుండి ఇంకా ఎంతమందిని మోసపోయారని, ఎంత మంది వద్ద ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేశారనే విషయంపై లోతుగా విచారణ చేసి తదుపరిచర్యలకు ఉపక్రమించడం జరుగుతుందని తెలిపారు.