ఎన్నికల నియమావళి కచ్చితంగా తెలిసి ఉండాలి: కలెక్టర్
-హరువులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు అయ్యేలా చూడాలి..
-పోలింగ్ కేంద్రాల వద్ద భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలి.
-కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి
సిరిసిల్ల యదార్థవాది
రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిఎల్ఓ లు సమర్దవంతమైన, స్పష్టమైన ఎలక్టోరల్ రోల్ ను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫోటో ఎలక్టోరల్ రోల్స్ 2వ ఎస్ఎస్ఆర్ 2023 పై మంగళవారం బూత్ స్థాయి అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించిన జిల్లా కలెక్టర్..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకమైన ఎన్నికల జాబితా తయారు చేయాలని, ఓటర్ల జాబితాలో మార్పులు చేయడంలో జాగ్రత్త వహించాలని ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల జాబితాను నిర్దారించి ఫారం -6 , ఫారం -6A ,ఫారం -6B ,ఫారం -7 ,ఫారం -8 ల గురించి ఓటర్లకు బూత్ లెవల్ అధికారులు తెలియజేయాలన్నారు. గరుడ (బిఎల్ఓ) యాప్ లో వివరాలను సక్రమంగా నమోదు చేయాలని, ప్రతి పోలింగ్ స్టేషన్లను సందర్శించాలని, ఓటర్లకు సమీపంగా పోలింగ్ కేంద్రాలు ఉండేలా జాగ్రత్త వహించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని, ఓటరుగా ఉన్న ప్రతిఒక్కరి ఫోటో, ఇతర వివరాలు సరిగా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగుల వృద్దుల కొరకు ప్రత్యేకంగా ర్యాంపులతో పాటు మౌళిక సదుపాయాలను ఖచ్చితంగా కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ , ఆర్డీఓ పవన్ కుమార్, తహశీల్దార్ రాజు, అసెంబ్లి లెవల్ మాస్టర్ ట్రైనర్లు, ఇతర ఎన్నికల అధికారులు పాల్గోన్నారు.