ఒక దేశం, ఒకే ఎన్నికకు..టీడిపి పూర్తి మద్దతు
జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 14: జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనే జరుగుతాయని టీడిపి అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు.. శనివారం మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ త్వరలో పార్లమెంటు ముందుకు తెస్తున్న ఒకే దేశం ఒకే ఎన్నిక టిడిపి పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు. భారతదేశంలో ఒకే రోజు అన్ని రాష్ట్రాల నుండి ఎన్నికలు నిర్వహించాలనే అభిప్రాయాన్ని అందరూ ఏకీభవించాలని టిడిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తాయని, ఎన్నికలు ఒకే రోజున నిర్వహించడం వల్ల అభ్యర్థులు, పార్టీలు సమగ్ర ప్రచారం చేయడానికి అవకాశాలు పెరుగుతాయని, జామిలి ఎన్నికతో ఆర్థిక ప్రయోజనం ఎన్నికల నిర్వహణకు ఖర్చులు కూడా తగ్గుతాయని, దేశవ్యాప్తంగా ఒకే రోజు ఎన్నికలు జరగడం వల్ల, ప్రభుత్వం ముందు పడ్డ అంశాలపై చాలా ప్రభావవంతంగా పని చేయగతయని, అయితే, ఈ విధానం వల్ల వ్యతిరేకంగా పలువురు రాజకీయ పార్టీలు ఇతర వ్యక్తులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.. కాని మా పార్టీ విషయంలో మాత్రం ఓకే దేశం ఓకే ఎన్నికకు పూర్తి మద్దతిస్తున్నామని ఆయన తెలిపారు..