ఓటు హక్కు పై ఉద్యోగుల సదస్సు
మెదక్ యదార్థవాది ప్రతినిది
వంద శాతం ఓటింగ్ లక్ష్యంలో భాగంగా కర్మ చారి కళ్యాణ్ మిషన్ పేరుతో శనివారం ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో ఆ సంఘం ఆధ్వర్యంలో ఓటు హక్కు పై ఉద్యోగుల సంక్షేమ సదస్సు నిర్వహిస్తున్నట్లు టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షి షా టీఎన్జీవోల కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ఉద్యోగులందరూ పాల్గొని వారి సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు. ఆయన వెంట జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గాండ్ల అనురాధ పాల్గొన్నారు.