ఓటు హక్కు మన ఆయుధం
యదార్థవాది ప్రతినిధి మెదక్
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు ఆయుధం లాంటిదని ప్రతి ఒక్కరు నైతిక బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు.. 13వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా బుధవారం శ్రీ ఆధ్వర్యంలో ర్యాలీని ప్రారంభించారు.. ర్యాలీలో సుమారు రెండు వేల మంది విద్యార్థిని, విద్యార్థులతో పాటు ఉద్యోగ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని ఓటర్ ఫర్ బెటర్ ఇండియా మై ఓట్ మై ఫ్యూచర్ మైండ్ ఓట్ మై ఫ్యూచర్ నినాదంతో ర్యాలీ రాందాస్ చౌరస్తా నుండి ఐబి అది ది గృహం వరకు సాగింది.. ఈ సందర్భంగా ప్రతిమ సింగ్ మాట్లాడుతూ మీ ఓటే మీ సర్వం మీ భవిష్యత్తు కు నాంది అని, ఏటువంటి ప్రలోభాలకు లొంగక ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని సూచించారు . కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ప్రతి ఏడాదికి నాలుగు సార్లు నమోదు కార్యక్రమం చేస్తుందని, 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించడంతోపాటు 17 సంవత్సరాలు నిండిన యువత కూడా ముందుకు రావాలని అన్నారు. ఫారం 6 ద్వారా ఓటరుగా నమోదు తో పాటు 6బి ద్వారా ఓటర్ గుర్తింపు కార్డు కొరకు ఆధార్ లింక్ చేసుకోవాల్సిందిగా ప్రీతం సింగ్ సూచించారు.. ఈ ర్యాలీలో స్వీట్ నోడల్ అధికారి రాజిరెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సత్యనారాయణ, మైన్స్ సలహా సహాయకులు జయరాజ్, నేటి పార్లర్ శాఖ ఈఈ శ్రీనివాసరావు, డిఎస్పి సైదులు, తాసిల్దార్ శ్రీనివాస్, ఎలక్షన్ సిబ్బంది నరేష్, తదితరులు పాల్గొన్నారు..