కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీటీసీ
నిజమాబాద్ యదార్థవాది
ఇందల్వాయి మండలం తిర్మపల్లీ గ్రామపంచాయతీలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీటీసీ చింతల దాస్.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మన ప్రభుత్వం పేదల ప్రభుత్వ మని పేద ప్రజల్ని ప్రత్యేకంగా గుర్తుంచుకొని తన వంతు సహకారంగా ప్రతి ఒక్కరి కంటి చూపులు మంచిగా ఉండాలని ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా
కంటి వెలుగును శిబిరాన్ని నిర్వహిస్తున్నారని, సీఎం కేసీఆర్ మాత్రమే తెలంగాణ అభివృద్ధి తో పాటు ఆరోగ్య సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టారని భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన
దగ్గర అమలవుతున్నాయని అన్నారు. 18 సంవత్సరాలు నుండి 55 సంవత్సరాల వరకు ఈ కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం తలపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరి పింఛన్ రైతుబంధు లాంటి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేయలేదని ఆయన గుర్తు చేశారు. మన ప్రభుత్వం వచ్చాక ప్రతి బీదవానికో గుర్తింపు వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్పల్లి ప్రభాకర్, బిరేశ్ శెట్టి, ఇమ్మడి సాయిలు, క్రాంతి కుమార్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.