33.6 C
Hyderabad
Friday, May 16, 2025
హోమ్తెలంగాణకాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైంది

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైంది

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైంది

హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 7: ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. శనివారం ఆయన మాట్లాడుతూ నేటిక ప్రజా పాలన లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైందని, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా శాఖల పరంగా, ప్రభుత్వ పరిపాలన పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సహచర మంత్రులు శాసన సభ్యులు,శాసన మండలి సభ్యులు అధికారులు, కార్యకర్తల సంతృప్తిగా ప్రజాసేవ చేశాం
ఈ ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది.. రెండు లక్షల రైతు రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్,అక్క చెల్లలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం తో పాటు సంవత్సర కాలంలో 55 వేల ఉద్యోగాల భర్తీ చేశామని అన్నారు. విద్యార్థి నాయకుడిగా గురుకులాల్లో ఉన్న భాధలు తీర్చడానికి 40 శాతం కాస్మొటిక్, డైట్ చార్జీలు పెంచామని, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం.. భవిష్యత్ నాలుగేళ్లలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం.. ప్రజల ఆకాంక్షల అనుగుణంగా పని చేస్తమని, మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు . ప్రజలు మరింత సహకరించాలని పొన్నం ప్రభాకర్ పత్రిక ప్రకటనలో తెలిపారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్