కారు బోల్తా.2 క్వింటాళ్ల గంజాయి.
సంగారెడ్డి యదార్థవాది ప్రతినిది
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లి సమీపంలో కారు ప్రమావశాత్తు బోల్తా పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించినలో కారులో 2 క్వింటాళ్ల గంజాయి పొట్లాలను చూసి అవాక్కయ్యారు.
భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ముంబయికి గంజాయి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన స్మగ్లర్లు కారును గంజాయిని అక్కడే వదిలేసి పరారైనట్లు తెలిసింది. గంజాయిని కారును స్వాధీనం చేసుకొని చిరాగ్పల్లి ఠాణాకు తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.