31.2 C
Hyderabad
Friday, May 23, 2025
హోమ్తెలంగాణకార్మికులకు పెంచిన వేతనం వెంటనే అమలు చేయాలి

కార్మికులకు పెంచిన వేతనం వెంటనే అమలు చేయాలి

కార్మికులకు పెంచిన వేతనం వెంటనే అమలు చేయాలి

కొండపాక /కలెక్టరేట్ యదార్థవాది

మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 2022 మార్చి 15న ముఖ్యమంత్రి అసెంబ్లీలో రూ.2000 పెంచుతున్నట్లు ప్రకటించి జీవో విడుదల చేశారు. కానీ నేటికీ 18 నెలల అయినప్పటికీ వేతనాలజీవో అమలు కావడం లేదని వెంటనే అమలు చేయాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) ఉపాధ్యక్షురాలు దాసరి కళావతి డిమాండ్ చేశారు.. సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కార్యాలయ ఏవో రహమాన్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దాసరి కళావతి మాట్లాడుతూ జీవో ఎంఎస్ నెంబర్ 8 విడుదల చేసినప్పటికీ ఆ జీవోలో నిర్దిష్టంగా ఎప్పటినుండి జీవో అమలు చేస్తారో స్పష్టత లేదన్నారు. 2022 మార్చి అసెంబ్లీలో వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించినప్పటి నుండి ఏరియర్స్ తో సహా కార్మికులకు చెల్లించాలన్నారు. కొత్త వెనూకి బడ్జెట్ పెంచాలని పెండింగ్ బిల్లు తక్షణ విడుదల చేయాలని, కోడిగుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని, ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇవ్వాలని మధ్యాహ్న భోజన నిర్వహణకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులే తక్కువ అవి కూడా నెలల తరబడి పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కార్మికులు అప్పులు చేసి వంట చేయడంతో అప్పులపాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అప్పుల ఊబిలో కోరుకు పోతున్నారని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రోజు మూడు కోడి గుడ్లు పెట్టలేదన్న సాకుతో కార్మికులను వేధిస్తూ తొలగిస్తున్నారని మరోపక్క గుడ్డు పెట్టడానికి అంగీకరించని స్వచ్ఛంద సంస్థ పై ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. అక్షయపాత్రకు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని ఈ నిర్ణయం అమలు అయితే కార్మికులందరూ రోడ్డున పడతారని తక్షణమే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వమే పాఠశాలలకు గుడ్డును అదనంగా బడ్జెట్ ను కేటాయించలని అన్నారు. జూన్ 20 నుండి కొత్త మెనూ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని ఇప్పుడు మేనూకే కేటాయించిన బడ్జెట్ సరిపోడం లేదని పైగా కొత్త కిచిడి మిక్స్ డ్ వెజిటేబుల్ కర్రీ వెజిటేబుల్ బిర్యానీ వారానికి ఒకసారి, మూడు కోడిగుడ్లు పెట్టాలని నిర్ణయించిందని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొండపాక మండల కార్యదర్శి అమ్ముల బాల్ నర్సయ్య మధ్యాహ్న భోజన కార్మికులు శశిరేఖ, కనకలక్ష్మీ, యమునా, లలిత, రేణుక, నాగలక్ష్మి, పద్మ, రేణుక, భాగ్యలక్ష్మి, భూలక్ష్మి, రమేష్ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్