కాలువలో మునిగిన యువకుడి మృతదేహం వెలికితీత
బాల్కొండ యదార్థవాది
నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ నగర్ గ్రామంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువలో మంగళవారం మునిగిన సాయిరామ్ బుధవారం పోలీసులు గజగీతగాళ్లతో వెలికి తీయించారు. కాలువలో పడి చనిపోయిన సాయిరాం శవాన్ని వెలికి తీయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు కొద్దిసేపు NH63 జాతీయ రహదారిపై రాస్తారో నిర్వహించారు. బాల్కొండ తహసిల్దార్ వినోద్, ఆర్మూర్ రూరల్ సిఐ గోవర్ధన్ రెడ్డి, బాల్కొండ ఎస్సై గోపి, తమ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని రాస్తారోకుని విరమించేశారు. పోచంపాడు నుండి గజ అయితే గాలను రప్పించి శవాన్ని వెలికి తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం అని ఎస్సై గోపి తెలిపారు.