కుల మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న బీజేపీ
* ప్రజల మద్దతు బీఅర్ఎస్ పార్టికే ఉంది.
* కేసీఆర్ ను ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు ఒకటిగా పని చేశాయి.
* ఆరు గ్యారంటీలు అమలు చేయలేక బెదిరింపులకు దిగుతున్న కాంగ్రెస్
* పోలీస్ స్టేషన్ కొత్త కాదు, ఉద్యమం కొత్త కాదు, పోరాటం కొత్త కాదు.
* సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
గజ్వేల్ యదార్థవాది ప్రతినిధి
గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కృతజ్ఞత సభలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ మండలాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని మాజీ ఎఫ్ డీ సి ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ కేసీఅర్ ను ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు పని చేశాయని కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని అయినా కూడా ప్రతి కార్యకర్త ఎంతో అద్భుతంగా పని చేసి కేసీఅర్ గెలుపు కోసం కృషి చేశారు. కేసీఆర్ పై 154 మంది నామినేషన్లు వేశారు విత్ డ్రా తర్వాత 47 మంది మిగలగా నాలుగు ఈ వి ఏం మిషన్ల ఏర్పాటుతో కొందరు తికమక పడ్డారని అయినా 45 వేల మెజారిటీతో మూడోసారి గెలుపు అందించారు. గజ్వేల్ ప్రజలందరికీ కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారని అన్నారు. డిసెంబర్ 9 న రుణమాఫీ 4 వేలకు పించన్లు, కరెంట్ బిల్లు కట్టొద్దు రైతు బంధు పెంచుతాం వడ్లకు 500 బోనస్, నిరుద్యోగ భృతి అన్నరు ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నరని ఆయన విమర్శించారు. బిజెపి దేశంలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టి పప్పం గడుపుకోవాలని చూస్తోంది ఇందుకు నిదర్శనమే అయోధ్య రామయ్యను ఎత్తుకున్నారు. ఈ దేశం ఆదానీ అంబానీ చేతుల్లో ఉందని ఆదాని అవినీతి వెనుక ప్రధాని మోదీ ఉన్నడని ఈ ఇద్దరి చేతుల్లో 500 కంపెనీలు ఉన్నయని రాహుల్ గాంధీ అంటడు సాయంత్రం రేవంత్ ఆదాని కలిసి హగ్ ఇచుకుంటరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటరు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో మీకు పూర్తిస్థాయిలో సహకారం ఉంటుందని లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు మనకు అద్భుతమైన విజయ అందనుందని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ 17సీట్లను గెలిచి ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని హరీష్ రావు అన్నారు. అంతకు ముందు నియోజక వర్గ నాయకులు మాట్లాడుతూ సీట్లు తగ్గుతాయి కానీ మన పార్టీ ఏ గెలుస్తుంది అనుకున్నాం కానీ ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉంది అని గమనించలేక పోయాం అన్నారు ప్రజల్లో వచ్చిన ఈ మార్పుకు కొంతమంది నాయకులే అని మనం ఇప్పటికైనా గుర్తించి సరైన విధంగా మన పార్టీ నాయకుల్లో మార్పు రావాలని కిందిస్తాయి నాయకుని తో పాటు జెనాల సమస్యలు గుర్తించి వాటికి అనుగుణంగా గల్లీ స్థాయి నాయకులకు గుర్తింపు వచ్చేలా కొన్ని పద్ధతులు తీసుకురావలన్నారు ప్రతిదీ ఆన్ లైన్ విధానం లో నడుస్తున్నందున స్థానిక సర్పంచ్ కూడా మన పార్టీ పథకాల అమలులో తగిన గుర్తింపు కానీ అవసరం గాని లేకపోవడం తో కూడా మన పార్టీకి కొన్ని నష్టాలను చవి చూసింది అన్నారు . గత మన ప్రభుత్వం చేసిన అనేకమైన మంచి పనులు చాలామట్టుకు అధికారుల చేతులమీదుగా కొనసాగినందున జవాబు దారి తనం లోపించి మన కోసం మనం గట్టిగ చెప్పుకోలేని పరిస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేసారు నాయకులు. ఇప్పటికైనా అందరిని కలుపుకుపోయి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గాని స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని బీఆరెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్య నాయకులతో పాటు అందరూ కష్టపడాలన్నారు. ఆలా కాకుండా కష్టపడేది ఒకరు పదవులు అనుభవించేది ఒకరు అన్న చందంగా వెళ్తే అది మన అందరికి చాలా నష్టం అని బల్లగుద్ది మరి అసహనం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూమ్ రెడ్డి డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఎంపీటీసీ ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ నియోజకవర్గ జడ్పిటిసి ఎంపీటీసీలు సర్పంచులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.