కేంద్ర బలగాలతో మండల కేంద్రంలో కవాతు
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండల కేంద్రంలో గురువారం తహసిల్దార్ కార్యాలయం నుండి ప్రధాన రహదారి గుండా అంబేద్కర్ వరకు అంబేద్కర్ నుండి మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా కేంద్ర బలగాలు, పోలీసులు కవాతు నిర్వహించారు ఎన్నికలవేళ కేంద్ర బలగాలతో కలిసి పోలీస్ బలగాలు కలిసి ప్రజలకు భరోసా కల్పిస్తూ సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కును ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని ప్రజలకు భరోసా కల్పిస్తూ పోలీస్ కవాతు నిర్వహించడం జరిగిందని ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీస్ కేంద్ర రాష్ట్ర బలగాలను వినియోగించుకొని శాంతి భద్రతలను కాపాడుటకు. ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పకుండా పాటించాలని కేంద్ర బలగాలతో కవాతును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వాసాల సతీష్, సీఐ కిరణ్, ఎస్ఐ తిరుపతి కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.