31.2 C
Hyderabad
Friday, May 23, 2025
హోమ్తెలంగాణకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం మరిచారు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం మరిచారు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం మరిచారు..

మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి

హాథ్ సే హాథ్ జోడో యాత్ర లో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గ అక్కన్నపేట్ మండలంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి చేపట్టిన పల్లె పల్లె కు గడప గడప కు ప్రవీనన్న కాంగ్రెస్ కార్యక్రమం ఆదివారం అంతక్ పేట్ లో మహిళలు,  గ్రామస్తులు ప్రవీణ్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు.. మొదటగా ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం పట్టించు కోవడం లేదని, తానూ రైతేనని ముఖ్యంగా హుస్నాబాద్ ప్రాంత రైతాంగం బాధలు తనకు తెలుసు అని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో మాత్రమే రైతులకు సరైన న్యాయం జరిగిందని స్థానీకేతరుడైన ఎమ్మెల్యే కు ఇక్కడి రైతుల గోస పట్టడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లోనే గౌర వెళ్ళి ప్రాజెక్టుకు శంఖు స్థాపన చేశారని, ప్రాజెక్టు పూర్తి చేయక పోగా ఇటు భూ నిర్వాసితులకు సైతం సరైన న్యాయం చేయలేదని, పేద వానికి సంక్షేమ ఫలాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి తీసుకు రావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాం లో జరిగిన అభివృద్ధి తప్ప.ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, ధాన్యం కొనుగోలు విషయం లో తేమ పేరు మీద తరుగు తీసి మిల్లర్లు రైతుల పొట్ట కొడుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే ఏక కాలంలో రూ. 2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తాం అని, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం చేస్తామని రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనీస పించన్ రూ.5000 ఇస్తామని, అధికారం లోకి వచ్చిన మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని, అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని, భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేల సాయం, భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు రూ.12 వేల సాయం అందిస్తామని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నీ అధికారం లోకి తీసుకువచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చిన సోనియా గాంధీ ఋణం తీర్చు కోవాలని కోరారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కేడం లింగ మూర్తి, సింగిల్ విండో చైర్మన్ బోలిషెట్టి శివయ్య, అక్కన్నపేట మండల పార్టీ అధ్యక్షులు జంగపల్లి అయిలయ్య, హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బంక చందు, కోహెడ మండల పార్టీ అధ్యక్షులు మంద ధర్మయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పాందరాల దామోదర్,ఎస్సీ సెల్ ఆకునూరి వెంకట్రాజం,బిక్యా నాయక్, హుస్నాబాద్ కౌన్సిలర్లు వల్లెపు రాజు, పున్న లావణ్య సది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్