కేసీఆర్ సభను విజయవంతం చేయాలి: ఎర్రోళ్ల శ్రీనివాస్
సంగారెడ్డి యదార్థవాది ప్రతినిది
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 27 వ తేదీన సంగారెడ్డిలో నిర్వహించే బీఅర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని జిల్లా నాయకులకు కార్యకర్తలకు టిఎస్ఎంఎస్ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంగారెడ్డి రానున్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త ప్రతి వార్డులో గ్రామాలలో పర్యటించి పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని ప్రతిపక్షాలకు కండ్లు తిరిగేలా సంగారెడ్డి గులాబీ మయం కావాలన్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ నాయకుల స్థానిక నేతలతో కలిసి సభ ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు సలహాలు చేశారు.