కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ఇంట్టిటి ప్రచారం.
దుబ్బాక యదార్థవాది
దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో శుక్రవారం కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటా ప్రచార కార్యక్రమంలో భాగంగా టిపిఎస్ రాష్ట్ర కన్వీనర్ బూర మల్లేశం పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంట అందుతున్నాయని ప్రజలు కేవలం కొత్త ప్రభాకర్ రెడ్డికి కారు గుర్తుకు మాత్రమే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర కన్వీనర్ బూర మల్లేశం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలే విజయానికి పునాది టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలను నచ్చి ప్రజలు కేసిఆర్ ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు అందవలసిన హక్కుగా పథకాలను కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా సాధ్యమయిందని రాబోయేది కేసీఆర్ ప్రభుత్వం దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు శ్రీరాం రామకృష్ణ ప్రభు బరిగే నర్సింలు గొడుగు మల్లేశం మహేష్ చింటు తదితరులు పాల్గొనారు.