క్రైస్తవ సోదర సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు… మంత్రి హరిష్ రావు
సిద్దిపేట 24 డిసంబర్ 22
ఉమ్మడి మెదక్ జిల్లా క్రైస్తవ సోదర, సోదరీమణులకు, మంత్రి హరీశ్ రావు క్రిస్మస్ శనివారం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రేమ,సేవాతత్పరతను, క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మించినరోజును క్రైస్తవ సోదరులకు అత్యంత సంతోషకర పవిత్రమైన రోజుఅని, ఆనందోత్సహాలతో
ఈ పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని పేద క్రిస్టియన్లకు ప్రభుత్వం కానుకగా బట్టలు పంపిణీ చేసిందని, యేసు ప్రభు దీవెనలతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ఆభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశ స్ధాయి లో అమలు అయ్యేలా బి ఆర్ ఎస్ పార్టీ ని దేశంలో గుణాత్మక మార్పు తెచ్చాల యేసు ప్రభు ఆశీర్వదాలు ఇవ్వాలని ఆకాంక్షించారు.