గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారి పరీక్ష ప్యాడ్ల వితరణ
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు ప్రతి సంవత్సరం తెలంగాణలో పలు ప్రాంతాలలోనీ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సుమారుగా 4 లక్షల రూపాయల విలువచేసే పరీక్ష ప్యాడులను వారి తల్లి పేరు మీదుగా అందజేస్తున్నట్టు విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించి వారి భవిష్యత్తుకు మైలురాయి వేసుకోవాలని ఆశిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకుడు జగదీశ్వర్ (రిటైర్డ్ టీచర్) తెలిపారు. అందులో భాగంగా 13వ తేదీ బుధవారం రోజున సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రము లో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 38 జిల్లా పరిషత్ హై స్కూల్లో61 తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్( బాలురు ) లో80 తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ నాగ సముద్రాలలో91 జిల్లా పరిషత్ హై స్కూల్ బస్వాపూర్ 24లో పదవ తరగతి చదువుతున్న 294 మంది విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్( రిటైర్డ్ టీచర్ )ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తల్లి పేరున ట్రస్టు ఏర్పాటు చేసి సమాజంలోని పేదలకు సేవ చేయడము, ప్రభుత్వ విద్యాసంస్థలలో చదివే పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు ఇవ్వడం అభినందనీయమని, అదేవిధంగా విద్యార్థులు కూడా చక్కగా చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని భవిష్యత్తులో ఉన్నత స్థాయి చేరుకొని సమాజంలో మీ వంతుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కెజీబివి స్పెషల్ ఆఫీసర్ వై హిమబిందు టిఎస్ డ్బ్యుఅర్ఎస్ ప్రిన్సిపాల్ కే వెంకట చలపతి టీఎస్ఎంఎస్ ప్రిన్సిపాల్ కే నరేందర్ రెడ్డి కోహెడ బస్వాపూర్ ప్రధాన ఉపాధ్యాయులు ఎండి మహమూద్,ఆర్ పద్మయ్యలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.