గంజాయి పట్టివేత నిందితుల అరెస్ట్
యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్
నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఆకాశ రామన్న సమాచారంతో పోచంపాడు ప్రాజెక్టు వద్ద గంజాయి విక్రయిస్తున్న కళ్యాణ్, సంతోష్ లను అదుపులోకి తీసుకున్న ఆర్మూర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీఫెన్సన్, సబ్ ఇన్స్పెక్టర్ ఏ. గంగాధర్.. గంజాయిని విక్రయిస్తున్న విచారించగా తాము నిర్మల్ కు చెందిన రాజ్ కుమార్ వద్ద తీసుకువచ్చినట్లు తెలియ జేశారు. నిందితులను రాజ్ కుమార్ ఇంటికి తీసుకెళ్లి తనిఖీ చేయగా అతని వద్ద గంజాయి ఉండడంతో రెండు బైక్స్ 230 గ్రాములు గంజాయి పట్టుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసి శుక్రవారం కోర్టులో హాజరు పరిచిన పోలీసులు..