గజ్వేల్ లో ఘోర రోడ్డు ప్రమాదం
-రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి..
-తీవ్ర ధ్రిగ్బాంతికి గురైన మంత్రి పొన్నం ప్రభాకర్
గజ్వేల్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: గజ్వేల్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుల్ లు మరణించడం తీవ్ర ధ్రిగ్బాంతికి గురి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా పెద్దకోడూరు, గాడిచర్ల పల్లి గ్రామాలకు చెందిన వెంకటేశ్, పరందాములు దౌల్తాబాద్, రాయాపోల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగే మారథాన్ లో పాల్గొనేందుకు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం గజ్వేల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుల్ లు మరణించడం తీవ్ర ధ్రిగ్బాంతి కి గురి చేసిందని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇంత చిన్న వయసులో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయింది వారికి ఆ దేవుడి ధైర్యాన్ని ప్రసాదించాలని, వారి కుటుంబాలకు ప్రభుత్యం అండగా ఉంతుందని మంత్రి తెలిపారు.