22.2 C
Hyderabad
Sunday, March 16, 2025
హోమ్తెలంగాణగులాబీ కండువా కప్పుకున్న గుండ్లపల్లి యువత.

గులాబీ కండువా కప్పుకున్న గుండ్లపల్లి యువత.

గులాబీ కండువా కప్పుకున్న గుండ్లపల్లి యువత.

యదార్థవాది మానకొండూరు ప్రతినిది

మానకొండూరు నియోజకవర్గం లోని తిమ్మాపూర్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మానకొండూరు శాసనసభ్యులు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణ గన్నేరువరం జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, గంప వెంకన్న గునుకుల కొండాపూర్ ఎంపీటీసీ గూడెల్లి ఆంజనేయులు సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. అనంతరం నూతనంగా పార్టీలో చేరే వారికి కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గుండ్లపల్లి గ్రామానికి చెందిన నాయకులు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో సాధారణ కుటుంబాలకు సైతం న్యాయం చేసే విధంగా ఉందని, పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని రానున్న ఎన్నికల్లో రసమయి బాలకిషన్ ని ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించడానికి మా వంతుగా కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల మేనిఫెస్టోను ప్రజలెవరు నమ్మవద్దని పొరపాటున కూడా కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో కాల్వ సంతోష్, పొలం దేవయ్య, పుట్ట శ్రీనివాస్, సొల్లు రవి, ఎండి రఫీ, కొరివి శేఖర్, ముల్కల రాజు, పంబాల రాజు, యంసాని అనిల్, రేషవేణి రాజు, రేషవేణి సంతోష్ మరియు టిఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షులు చింతల రవి, గ్రామ శాఖ అధ్యక్షులు పంబాల ఎల్లయ్య, పార్టీ సీనియర్ నాయకులు ములకల లక్ష్మణ్, ములకల అశోక్, ముల్కల అజయ్, ముల్కల సంతోష్, గునుకుల కొండాపూర్ న్యాలపట్ల శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్