33.6 C
Hyderabad
Friday, May 16, 2025
హోమ్తెలంగాణగ్రామపంచాయతీ కార్మికులకు సంఘీభావం.

గ్రామపంచాయతీ కార్మికులకు సంఘీభావం.

గ్రామపంచాయతీ కార్మికులకు సంఘీభావం.

ఆలేరు యదార్థవాది

ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె కు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల అయిలయ్య మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గ్రామ పంచాయతీ కార్మికులు వేతనాల పెంపు, పర్మినెంట్ చెయ్యాలని, కారోబార్, బిల్ కలెక్టర్లను పంచాయతీ సహాయ కార్యదర్శులుగా నియమించాలని రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జివో నెంబర్ 60 ప్రకారం జితలు, ప్రమోషన్లు ఇవ్వాలని, కెసిఆర్ ప్రభుత్వం ఇవ్వటం లేదన్నారు. తెలంగాణ వస్తే మన బ్రతుకులు మారుతాయనుకుంటే ఏ వర్గానికి లబ్ధి చేకూరలేదని, తేలంగాణ వస్తే ధర్నాలు రాస్తారోకోలు లేవని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాస్తారోకోలు, ధర్నాలో ఉన్నాయని, ఇప్పటికైనా వారి న్యాయమైన డిమాండ్లు తిర్చేవరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సిరిబోయిన మల్లేష్ యాదవ్ మాజీ జెడ్పిటిసి గంగాపురం మల్లేష్ మాజీ ఎంపిపి వీసం వెంకటేశ్వర్లు, సర్పంచ్ శ్రీశైలం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మదర్ గౌడ్ , చాడ శశిధర్ రెడ్డి, రఘునాధ రాజు , సీలా బాలకృష్ణ , NSUI నాయకులు రేగు రమేష్, జంపాల నాగచందర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్