గ్రామాలే దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలు
– ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్
హుస్నాబాద్ యదార్థవాది
గ్రామాలే దేశ సౌభాగ్యానికి పట్టు కొమ్మలని ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూరు గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం 40 లక్షల వ్యయంతో నిర్మించే నూతన గ్రామపంచాయతీ భవనానికి, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం భవనానికి భూమి పూజ, శంకుస్థాపన సి మాట్లాడారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీలకు నూతన భవనాలను నిర్మిస్తున్నామని, కొన్ని గ్రామపంచాయతీలు నూతన భవనాలను ప్రారంభం చేసామన్నారు. గ్రామం అన్ని రకాల మౌలిక వసతులు సిసి రోడ్ లు, విద్యుత్ దీపాలు , డ్రైనేజీలు, సామాజిక భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, వైకుంఠధామాలు ,పల్లె ప్రకృతి వనాలు, చెరువు కట్టలు, కుంటలు మరమ్మతులు ఇలా అనేక రకాల అభివృద్ధి పనులు గ్రామాల రూపురేఖల్ని మార్చాయని గ్రామ స్వరాజ్యం రాష్ట్ర సౌభాగ్యంగా అభివృద్ధిలో ముందుండి కొన్ని గ్రామపంచాయతీ లు రాష్ట్రస్థాయి అవార్డులు కూడా అందుకోవడంలో అధికారుల ,ప్రజల సహాయ సహకారాలతో సాధ్యమైందని ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ అన్నారు. అలాగే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లిమిటెడ్ కరీంనగర్ బ్యాంకు సేవలు అభినందనీయమని సహకార రంగ బ్యాంకులలో కరీంనగర్ సహకార బ్యాంకు సభ్యులు విశేషమైన సేవలు అందిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభినందనలు పొంది నూతన ఒరవడితో ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒకరు అనే సహకార నినాదంతో బ్యాంకు ఖాతాదారులకు వివిధ రకాల రుణాలు అందిస్తూ సంఘ సభ్యులకు పంట రుణాలు ,వ్యవసాయ పనిముట్ల కోసం, ట్రాక్టర్లు ,హార్వెస్టర్లు వివిధ రకాలైన యంత్రాలు, వ్యక్తిగత రుణాలు కూడా అతి తక్కువ వడ్డీ రేటు తో అందింస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు తదితరులు మాట్లాడారు. ఎంపీటీసీ భూపతి సుధేష్ణ ,సర్పంచ్ జిల్లల అశోక్ రెడ్డి, ఉప సర్పంచ్ బొల్లి శ్రీను, వార్డు మెంబర్లు, కోపరేటివ్ చైర్మన్ పంజా రాజయ్య ,వైస్ చైర్మన్ ముకుంద రెడ్డి,గ్రామస్తులు పాల్గొన్నారు.